E-PAPER

త్రిబుల్ ఐటి విద్యార్థులను అభినంధించిన అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షులు ఎరవెల్లి రాజారావు అలియాస్ జనత రాజన్న.

త్రిబుల్ ఐటి విద్యార్థులను అభినంధించిన అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షులు ఎరవెల్లి రాజారావు అలియాస్ జనత రాజన్న.

(హైదరాబాద్ /శుభ తెలంగాణ )త్రిబుల్ ఐటీ ఎంపికైన అంబేద్కర్ వారసులకు అంబేద్కర్ మాల సంఘం  సుద్దాల రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో   ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షులు ఎరవెల్లి రాజారావు అలియాస్ జనత రాజన్న మాట్లాడుతూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల ప్రభుత్వ పాఠశాల చదివిన ఎరవెల్లి అక్షిత, లక్కం అక్షయ  త్రిబుల్ ఐటీ సాధించిన వారికీ మరియు తల్లిదండ్రులకు అంబేద్కర్ మాలకుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి  అంబేద్కర్ గారి చిత్రపటం ఫోటో అందజేయడం జరిగింది.అలాగే భవిష్యత్తులో బాగా చదివి అంబేద్కర్ గారి ఆలోచన విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలినీ చదువు అనే ఆయుధంతో మన భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్ మారుతుంది అనిఅన్నారు.అంబేద్కర్ గారు ఇచ్చిన   జ్ఞానం భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల సంఘం ఉపాధ్యక్షుడు ఎగదండి రవీందర్, నాయకులు ఎరవెల్లి నాగరాజు, ఎరవెల్లి కిషన్, ఎల్ ఐ సి మహేందర్, ఎగదండి మహిపల్, సందీప్, సురేష్, కరెంట్ టెక్నీషియన్ ప్రసాద్, సాగర్, రాజు, రత్నయ్య, తిరుపతి, నర్సావ్వ, రజిత, లలిత సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :