E-PAPER

ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సభత్వ నమోదు కార్యక్రమం

(కాప్రా/శుభ తెలంగాణ) సెప్టెంబర్ 12: ఉప్పల్ నియోజవర్గంలోని మనీషా గార్డెన్ లో బీజేపీ పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం దేవసాని బాలచందర్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వచ్చి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ బిజెపి సభ్యత నమోదు కార్యక్రమం ఈనెల రెండవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూతు స్థాయిలోనూ ప్రతి వ్యక్తిని కలిసి దేశంలో 10 సంవత్సరాలుగా సుపరిపాలన అందిస్తూ అవినీతి రైకంగా పాలన చేస్తూ దేశ అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచంలోనే భారత దేశ క్రీస్తు ప్రతిష్టలను పెంపొందించి 2014 కల్లా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా దేశంగా చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతుందని ఆయనను మరింత బలోపేతం చేయాలంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో చేసి విజయవంతం చేయాలని తెలియజేశారు.ఆయనతో పాటు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్దర్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుడు దేశంలో మాట్లాడడం చేతకాక అమెరికాకు వెళ్లి దేశ ప్రతిష్టను దేశ స్వాభా బాభిమానాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెల్లుతుందని ఆయన అన్నారు.ఈ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.ఈ నియోజకవర్గంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయించి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి రాంచంద్రర్, జిల్లా అధ్యక్షులు ఎస్. మల్లారెడ్డి,స్థానిక బీజేపీ నాయకులు నియోజకవర్గం, నియోజకవర్గం సభత్వ నమోదు జిల్లా సభ్యులు పోతగాని గోపాల్ గౌడ్,రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్ప రెడ్డి, రాజ్యలక్ష్మి కార్పొరేటర్,కార్పొరేటర్ చేతన,కార్పొరేటర్ శ్రీవాణి,ఉప్పల్ యం బి సి చైర్మన్ సంగిశెట్టి రవీందర్ సాగర్, నర్సింగ్ రావు,వెంకులు,వినోద్,నియోజకవర్గం ఎస్సి మోర్చా కన్వీనర్ తలపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :