E-PAPER

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కామెంట్స్ చేసిన వినయ్ కి బెయిల్ మంజూరు..

(హైదరాబాద్/శుభ తెలంగాణ)అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వినయ్ కుమార్ కి ఆదివారం నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజస్ట్రేట్ కోర్టు పదివేలు రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసి,విడుదల చేసింది.ఈ విషయాన్ని వినయ్ న్యాయవాదులు జక్కుల లక్ష్మణ్ మరియు లలిత రెడ్డి వెల్లడించారు.వినయ్ మీద రిమాండ్ లో చూపించిన సెక్షన్లు ఏడు సంవత్సరాల శిక్షా గడువు లోపు ఉన్నాయని.వినయ్ స్వయంగా పోస్ట్ చేయలేదని.అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఓ ఎస్ డి వెంకటేష్ పిర్యాదు మేరకు పోలీసు వారు ఒక ప్రముఖ ఛానల్ కామెంట్స్ ని ఆసరాగా తీసుకొని వినయ్ పై అక్రమ కేసు బనాయించారని తెలిపారు.చేయని తప్పును చేసినట్లుగా చూపించారని.న్యాయవాదులు జక్కుల లక్ష్మణ్ మరియు లలిత రెడ్డి కోర్టులో వాదించారని అన్నారు.అనంతరం కోర్టు వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేశారని  పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :