E-PAPER

బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బాజీబాబా

హైదరాబాద్ /శుభ తెలంగాణ  ఖమ్మం ఏప్రిల్ 14:

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బాజీ బాబా ఈ నెల 18న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో నిలుస్తు న్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించిన ఆయన.. జిల్లాలో ముస్లింలకు జరిగిన అన్యాయంపై గళం విప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ముస్లింల బలాన్ని, ఐక్యతను చాటేందుకు, కుట్రదారులను తరిమికొట్టేందుకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా. ఆయా పార్టీల నాయకులంతా ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, అందుకే తమ ఓట్లు తామే వేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నామినేషన్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై తనను ఆశీర్వదించాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :